మంచేరియల్, 2026-06-05
మంచిర్యాల జిల్లాలో నిరుద్యోగ యువతకు పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ (), ఫారెస్ట్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కీ.శే. శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ (), ఫారెస్ట్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ, మంచిర్యాల కాలేజీ రోడ్డులోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో కీ.శే. శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభ ఉన్న ఏ ఒక్క యువకుడు, యువతి ఉద్యోగ అవకాశాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన మెరుగైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కూడిన అభ్యాసం ద్వారా యువత తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కలతో ముందుకు సాగుతున్న యువతకు ఈ శిక్షణ కార్యక్రమం ఒక మంచి అవకాశంగా నిలవాలని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధించే వరకు పట్టుదలతో కృషి చేయాలని ఎమ్మెల్యే చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్, సభ్యులు, సింగరేణి సంస్థ అధికారులు, భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












