అంతర్గాం, శుక్రవారం
రామగుండం నియోజకవర్గంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహం, నీటి నిల్వలను అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన, గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామగుండం నియోజకవర్గంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహం, నీటి నిల్వలు, పరిస్థితులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరి తల్లికి సంప్రదాయబద్ధంగా వాయినం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రకృతి విపత్తులు కలగకుండా కాపాడాలని ఆయన ప్రార్థించారు.
అనంతరం ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే, వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే వెంట రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, కార్పోరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.











