న్యూఢిల్లీ, 2026-06-05
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కాంగ్రెస్ ఎంపీలు కీలక భేటీ అయ్యారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. ముఖ్యంగా రామగుండంమణుగూరు రైల్వే లైన్ పురోగతిపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేకంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, సురేష్ షెడ్కర్ న్యూఢిల్లీలో కీలక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజలకు అవసరమైన రైల్వే సౌకర్యాలపై పలు అంశాలను మంత్రితో చర్చించారు.
రామగుండంమణుగూరు లైన్పై ప్రత్యేక దృష్టి
ప్రత్యేకంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తన పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన రామగుండంమణుగూరు రైల్వే లైన్ పురోగతిపై మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించారు. సుమారు 4,000 కోట్ల అంచనా పెట్టుబడితో ప్రతిపాదించిన ఈ రైల్వే లైన్ ప్రస్తుత పరిస్థితి, పనుల పురోగతి, తదుపరి చర్యలపై ఎంపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పారిశ్రామికాభివృద్ధికి లైన్ కీలకం
రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల పారిశ్రామిక, వాణిజ్య మరియు రవాణా అభివృద్ధికి ఈ రైల్వే లైన్ ఎంతో కీలకమని ఎంపీ వంశీకృష్ణ మంత్రికి వివరించారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, త్వరితగతిన క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
మంత్రి సానుకూల స్పందన
ఎంపీ వంశీకృష్ణ వినతికి మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. రామగుండంమణుగూరు రైల్వే లైన్కు సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఎంపీకి వివరించినట్లు సమాచారం.
లు, ల పనుల్లో జాప్యంపై ఫిర్యాదు
అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే మంజూరైన లు, ల పనులు, నిధుల విడుదల, పనుల అమలులో జరుగుతున్న జాప్యాన్ని కూడా ఎంపీ వంశీకృష్ణ రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారు. గత రెండు సంవత్సరాలుగా ఈ అంశాలపై నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నప్పటికీ పనుల్లో ఆలస్యం జరుగుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రమాదాల నివారణకు చర్యలు
నిర్మాణ ప్రాంతాల్లో వాటర్ క్లాగింగ్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎంపీ సూచించారు. అలాగే పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల రైల్వే స్టేషన్ల అప్గ్రేడేషన్ అంశంపైనా రైల్వే శాఖ అధికారులతో ఎంపీ వంశీకృష్ణ చర్చించారు.
రైల్వే అభివృద్ధికి నిరంతర ఫాలోఅప్











