మంచేరియల్, 2026-07-22
కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఢిల్లీలో యువత, మహిళలపై లాఠీఛార్జ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టు, ఇతర ఎంపీల పట్ల దురుసు ప్రవర్తనకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన గళం వినిపించారు.
కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర విద్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువత, మహిళలపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని, ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పాటు ఇతర ఎంపీల పట్ల దురుసుగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు.
ఈ నిరసన కార్యక్రమానికి మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి అధ్యక్షత వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన గళం వినిపించారు.
అనంతరం డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి పుల్లూరి లక్ష్మణ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్, నాయకులు బండి సదానందం యాదవ్, మందమర్రి మున్సిపాలిటీ ఇన్చార్జి గోపతి బానేష్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.












