రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటెడ్ వర్కింగ్ జర్నలిస్టులకు 2026-2028 సంవత్సరాలకు TGSRTC కన్సెషనల్ బస్ పాసులు మంజూరు చేయనున్నట్లు సమాచార & పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ జి. ముకుందా రెడ్డి తెలిపారు. ఈ మేరకు TGSRTC మేనేజింగ్ డైరెక్టర్కు ఆదేశాలు జారీ అయ్యాయి. అర్హులైన జర్నలిస్టులు జూన్ 17 నుంచి TGSRTC వెబ్పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
సమాచార & పౌర సంబంధాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ బస్ పాసులు 2026, జూన్ 17 నుండి 2028, ఏప్రిల్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి. ఈ సౌకర్యం పొందాలనుకునే అర్హులైన జర్నలిస్టులు TGSRTC వెబ్పోర్టల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు కలిగిన వర్కింగ్ జర్నలిస్టులకు మాత్రమే ఈ బస్ పాసుల సౌకర్యం వర్తిస్తుంది. ప్రస్తుతం 2026-2028 సంవత్సరాలకు గాను రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఈ ప్రకటనకు సంబంధించిన కాపీని మీడియా అకాడమీ చైర్మన్, రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రజా సంబంధాల అధికారులకు (DPROలు) పంపినట్లు సమాచారం. అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.











