మంచేరియల్, 2026-09-10
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంచిర్యాలలో ముందస్తు సన్నాహక సమావేశం నిర్వహించి, చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు.
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి TGEJAC రాష్ట్ర కమిటీపిలుపు మేరకు చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి.* తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ గారి సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ రావు గారి మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తేదీ 10.09.2026 గురువారం రోజున చలో హైదరాబాద్ కార్యక్రమం ను విజయవంతం చేయడానికి TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారి మరియు సెక్రటరీ జనరల్ శ్రీమతి వనజా రెడ్డి గార్ల ఆధ్వర్యం లో *మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, జిల్లా ఇరిగేషన్ కార్యాలయం, ప్రభుత్వ ఐటిఐ/ఎటిసి సెంటర్ మరియు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల మంచిర్యాలలో* ముందస్తు సన్నాహక సమావేశం నిర్వహించి చలో *చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగినది. TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి గారు* మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర TGEJAC వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం ను విజయవంతం చేయడానికి మంచిర్యాల జిల్లా నుంచి 10 వేల ఉద్యోగ ఉపాధ్యాయ కాకార్మిక పెన్షనర్లు తక్కువ కాకుండా చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల పెన్షన్ సమస్యలను పరిష్కారం కొరకు మంచిర్యాల నుంచి పెద్ద ఎత్తున హాజరుకావాలని తెలపడం జరిగినది. తదుపరి *చలో హైదరాబాద్ వాల్ పోస్టర్* ను ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ సన్నాహక సమావేశం లో TGEJAC మంచిర్యాల జిల్లా *కో-చైర్మన్లు* పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు *డిప్యూటీ సెక్రటరీ జనరల్* అత్తే సుధాకర్ , బొడ్డు శ్రావణ్ కుమార్ *వైస్ చైర్మన్* నాగుల గోపాల్ సెక్రటరీలు నడిమెట్ల సత్యనారాయణ, తంగళ్ళపల్లి తిరుపతి, వెంకటేష్ TGEJAC నాయకులు జ్యోతి, పద్మలత మున్సిపల్, ఇరిగేషన్, ఎంప్లాయిమెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఫోరంనాయకులు శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్, టీజీవో,టీఎన్జీఓ, నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల మరియు కార్మిక సంఘాల ప్రతినిధులు నాయకులు మరియు జిల్లా లోని అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.











