మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నాలుగవ డివిజన్ బాలాజీ స్కూల్ ఆవరణలో ఈరోజు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. శ్రీరాంపూర్ సీఐ ఆదేశాల మేరకు ఎస్సై సంతోష్ ఈ కార్యక్రమానికి హాజరై, రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఎస్సై సంతోష్ మాట్లాడుతూ, మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపడం, సీటుబెల్టు ధరించకపోవడం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. వీటిని నివారించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ కార్యక్రమంలో ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాలుగో డివిజన్ పోలీస్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో రోడ్డు భద్రత డివిజన్ కమిటీ 12 మంది సభ్యులతో ఎన్నుకోబడింది.








