మంచేరియల్, 11-07-2026
మగుడపోలసకమిషనేటపిధిలోనిమచియలపటటణలోఎనటనగలోపోలసులుభగకడనఅడసెచనివహిచుసపఅబకిషోఝదేలమేకునివతిజిగినఈపేషనలోఅకమమదయవికేతలనుగుతిచి,వివదదఉననమదయనుసజచేు
రామగుండం పోలీస్ కమిషరేట్ సీపీ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో భారీగా కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. శనివారం రాత్రి 10 గంటలకు ఈ ఆపరేషన్ చేపట్టారు.
ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు ఎన్టీఆర్ నగర్లోని అన్ని వీధులు, ఇళ్లలో విస్తృతంగా సోదాలు చేశారు. లైసెన్స్ లేని వాహనాలు, బైకులు, ఆటోలను తనిఖీ చేశారు. అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్న వారిని గుర్తించి, వారి వద్ద ఉన్న మద్యంను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, యువత ఎలాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సూచించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. యువత పోలీస్ కేసుల పాలైతే బంగారు భవిష్యత్తు నాశనమవుతుందని, పోలీస్ కేసు ఉన్న వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని హెచ్చరించారు. రెండు, మూడు కేసులు ఉంటే పీడీ యాక్ట్ పెట్టి 2 సంవత్సరాలు జైలుకు పంపిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ శ్రీ ఏ. భాస్కర్, ఏసీపీ ఆర్ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ, జైపూర్ ఏసీపీ, మంచిర్యాల జిల్లా సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్ సహా సుమారు 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సీపీ గారు స్పష్టం చేశారు.












