మంచిర్యాల జిల్లాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 175వ జయంతిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయ సాధనతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ఆయన అందించిన సేవలు స్మరణీయమని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 175వ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, బీసీ అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, డి.సి.పి. ఎ.భాస్కర్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఐ.బి. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయ భవనంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత, దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు సదా స్మరణీయమని తెలిపారు. ఆయన కేవలం స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా, సమాజంలో సమానత్వం, మహిళల అభివృద్ధి, కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత విభేదాలు లేకుండా పౌరులందరూ సమానమని చాటుతూ రాజ్యాంగాన్ని రచించారని, విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు.






