సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కాలేశ్వరంలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ అధికారులచే ఘన స్వాగతం అందుకున్న మంత్రి, ఎంపీలకు ఆలయ ఈవో, వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, కాలేశ్వరం తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని, సరస్వతి అంత్య పుష్కరాలు భక్తులకు పవిత్రమైన అవకాశమని, రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, కాలేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు, పుష్కరాలు రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచుతున్నాయని, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
పుష్కరాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.











